U.P :వారణాసిలో ప్రధాని మోదీ పూజలు

-

ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేసే తేదీ ఫిక్స్ చేశారు. వారణాసి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మోడీ ఈ నెల 14వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. నామినేషన్ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో పాల్గొనేందుకు బీజేపీతో పాటు ఎన్డీయే కూటమిలోని కీలక నేతలు వారణాసికి బయల్దేరారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఇప్పటికే వారణాసి వెళ్లారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు రేపు వెళ్తారు.

ప్రస్తుతం వారణాసి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మోడీ మరోసారి అక్కడి నుండి బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. ఇక, వారణాసిలో ప్రధాని మోడీపై యూపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజయ రాయ్ పోటీకి దిగుతున్నారు. వారణాసిలో పోలింగ్ జూన్ 1వ తేదీన చివరి దశలో జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version