జైలుపై ఉక్రెయిన్​ బాంబు దాడి.. 40 మంది సొంతవాళ్లు మృతి

-

మనం తీసుకున్న గొయ్యిలో మనమే పడటం అనే సామెత ఉంది కదా. ఉక్రెయిన్‌ ప్రభుత్వం చేతుల్లో ఆ దేశ సైనికులే 40 మంది చనిపోవడం ఈ సామెతకు కరెక్ట్‌గా నిరూపించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఉక్రెయిన్ చేసిన​ బాంబు దాడి వల్ల ఓ జైలులో ఉన్న 40 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారని రష్యా మద్దతు గల వేర్పాటువాదుల ప్రతినిధి తెలిపారు. ఆ ఘటనలో 130 మంది గాయపడ్డారని కూడా చెప్పారు.

ఉక్రెయిన్​పై గత కొన్ని నెలలుగా రష్యా.. దండయాత్ర చేస్తూనే ఉంది. ఈ క్రమంలో రష్యా మద్దతు గల వేర్పాటువాదుల ప్రతినిధి కీలక విషయాన్ని వెల్లడించారు. మరియుపోల్​ ప్రాంతంలో జరిగిన యుద్దం తర్వాత అరెస్టైన ఉక్రెయిన్​ సైనికుల్లో 40 మంది మరణించారని, 130 మంది గాయపడ్డారని తెలియజేశారు. అయితే వీరంతా ఉక్రెయిన్​ చేసిన బాంబు దాడి వల్లే చనిపోయారని చెప్పారు.

ఒలెనివ్కా పట్టణంలోని జైలుపై షెల్లింగ్​ జరిపినట్లు వెల్లడించారు డొనెట్స్క్​లోని వేర్పాటువాదుల ప్రతినిధి డానిల్​ బెసొనోవ్​. దీనిపై ఉక్రెయిన్​ అధికారుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు.

యుద్ధసమయంలో.. అజోవ్ ఓడరేవు, స్టీల్​ మిల్​కు రక్షణగా ఉన్న ఉక్రెయిన్​ సైనికులు దాదాపు 3 నెలల అనంతరం రష్యాకు లొంగిపోయారు. అప్పటినుంచి వీరిని రష్యా మద్దతున్న డొనెట్స్క్​ వంటి ప్రాంతాల్లోని జైళ్లలో బంధించారు. ఇప్పుడు ఉక్రెయిన్​ బాంబు దాడిలో ఆ దేశానికే చెందిన 40 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news