అల్లు – నందమూరి ఫ్యామిలీల మధ్య సఖ్యత.. మెగా ఫ్యామిలీని దూరం పెట్టనున్నారా..?

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి , అల్లు కుటుంబానికి మధ్య ఎలాంటి సంబంధం ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అల్లు అరవింద్ కు చిరంజీవి స్వయాన బావవరస అవుతున్నప్పటికీ.. ఎన్నో అద్భుతమైన కథలను తీసుకువచ్చి తన గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మించి ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా వేడుక జరిగినా అల్లు, మెగా ఫ్యామిలీలు ఒకే చోట సందడి చేసేవారు. అయితే ప్రస్తుతం ఈ రెండు కుటుంబాల మధ్య పరిస్థితులు ఇలాగే కనపడడం లేదని తెలుస్తోంది. అల్లు ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించడానికి చిరంజీవి గెస్ట్ గా వచ్చి తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఇంకా విశ్వసించడం లేదు.

కొన్ని రోజులుగా మెగా కుటుంబానికి , అల్లు కుటుంబానికి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని గత కొంతకాలంగా వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని రెండు కుటుంబాలు చెప్పినప్పటికీ ఈ రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు ఉన్నాయని తాజాగా వీరి వ్యవహార శైలి చూస్తుంటే మనకు స్పష్టం అవుతుంది. అంతేకాదు అల్లు అర్జున్ పూర్తిగా ఇటీవల చిరంజీవి ఫ్యామిలీని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ నందమూరి ఫ్యామిలీకి బాలయ్యకు దగ్గరవుతున్నారు.అరవింద్ ఆహా సంస్థను స్థాపించడమే కాకుండా అందులో అన్ స్టాపబుల్ షో నిర్వహిస్తూ ఆ కార్యక్రమానికి బాలకృష్ణ వ్యాఖ్యాతగా తీసుకొచ్చారు.

Chiru Waiting For A Young Hero | ManaStars

బాలకృష్ణతో అల్లుఅరవింద్ తన సొంత బ్యానర్ లో సినిమా చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీ లో ఏ హీరో సినిమా అయినా విడుదల చేస్తున్నారు అంటే ఆ హీరోల సినిమా వేడుకలకు మెగా హీరోలు అతిధులుగా రావడం జరుగుతుంది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ హాజరవుతారు. అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక కోసం బాలకృష్ణను ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ కూడా చిరంజీవిని తన షోకి తీసుకురావడానికి నిర్మొహమాటంగా ఉన్నట్లు సమాచారం. ఇలా మొత్తానికైతే అల్లు అరవింధ్, బాలకృష్ణ బాండింగ్ తో మెగా ఫ్యామిలీ చిరంజీవిని దూరం పెడుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news