యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి దేవాలయ సందర్శన వాయిదా

-

నేడు హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం రెండు రోజుల పాటు జరగనుంది. జూలై 2, 3 తేదీల్లో నగరంలోని లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పార్టీ సీనియర్ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ ఐకానిక్ చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహారాజ్ సందర్శించాల్సిఉంది.

ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు భాగ్యలక్ష్మి మాత మందిరం సందర్శించి పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ కొన్ని అనివార్య కారణాల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ సందర్శన రద్దయినట్లు తెలుస్తోంది. అమ్మవారి ఆలయంలో జరిగే మహా హారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో హిందువులు తరలి రావాలని తెలంగాణ బీజేపీ నేతలు అభ్యర్థించారు. చివరి నిమిషంలో ఈ పర్యటన వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని రేపు(ఆదివారం) నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news