ఈ నెల 25న సీఎం జగన్ కార్యాలయాన్ని బైకులతో ముట్టడిస్తాం – యూటీఎఫ్ వార్నింగ్

-

అమరావతి : ఈ నెల 25వ తేదీన సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం జరుపుతోన్న చర్చలు కేవలం కాలయాపన కోసమేననీ..సీపీఎస్ రద్దుపై అధికారులు కాదు సీఎం జగనే మాకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు యూటీఎఫ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు.ఈ నెల 25న సీఎం క్యాంప్ కార్యాలయాన్ని బైకులతో ముట్టడిస్తాం..అవగాహన లేక పోతే మంత్రుల కమిటీ, ఆ తరువాత అధికారులు కమిటీ ఎలా వేశారు..?అని ప్రశ్నించారు.

హామీ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సీపీఎస్ రద్దు చేస్తున్నాయి…అధికారంలోకి వచ్చిన వారం లోపు సీపీఎస్ రద్దు అన్నారు.. మూడేళ్లు అయిందన్నారు.అవగాహన లేక సీఎం వాగ్దానం చేశారని. సీఎం చుట్టూ వున్న వారు చెబుతున్నారని..సీపీఎస్ రద్దు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై తక్షణం ఆర్థిక భారం ఉండదని మండిపడ్డారు.

సీఎం తన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి.. మార్చి 31 లోపు రోడ్ మ్యాప్ అన్నారు అయితే నేటికి లేదనీ తేల్చి చెప్పారు.ఈ నెల 18 నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీలు 25వ తేదీన విజయవాడ చేరుతాయి…అప్పటి లోగా సీఎం నిర్ణయం తీసుకోక పోతే ఈ బైక్ లు అన్ని సీఎంవోను చుట్టు ముడతాయని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news