ఇతని భక్తికి దండం పెట్టాలి..ఏకంగా చేతులతో..

-

మన భారత దేశంలో దేవుడిని నమ్మేవారు ఎక్కువే.. అందుకే వీధి వీధికి దేవాలయాలు ఉన్నాయి.. దేవుడు మీద కొందరికి అపారమైన భక్తి ఉంటుంది. మనం ఎంత కష్టపడి మొక్కులను చెల్లిస్తామో అంతగా మనల్ని కరునిస్తారని నమ్ముతారు.. హిందూ సమాజంలోని దేవతలకు మందిరాలు నిర్మించి పూజలు జరుపుతుంటారు. దేశంలో దైవాన్ని నమ్మి పూజలు చేసేవారు కోకొల్లలు..

తమ మొక్కు చెల్లించుకునేందుకు రకరకాల మార్గాలను వెతుక్కుంటారు. తలనీలాలు సమర్పించడం, కాలినడకన రావడం, నిలువుదోపిడీ ఇవ్వడం, ముడుపులు సమర్పించుకోవడం.. ఇలా తమకు తోచిన విధంగా ఇష్ట దైవానికి సమర్పించుకుంటారు. ఇలా చేయడం ద్వారా తమ సమస్యల నుంచి భగవంతుడు బయట పడేస్తాడని నమ్ముతుంటారు. అయితే.. ఈ భక్తుడు మాత్రం అందరి కంటే వినూత్నంగా దైవాన్ని దర్శించుకునేందుకు బయటల్దేరాడు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది.

ఇక విషయాన్నికొస్తే.. అశోక్‌ అనే ఓ 46 ఏళ్ల భక్తుడు.. తన ఇష్టదైవమైన వైద్యనాథ్‌ దర్శనం చేసుకోవాలనుకున్నాడు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని దేవ్‌గఢ్‌లో ఉన్న బాబా వైద్యనాథ్‌ దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరాడు. ఇందులో విశేషమేముంది అనుకుంటే పొరపాటే. అతను మామూలుగా నడిచి వెళ్లడం లేదు. కాళ్లు పైకెత్తి చేతులమీద నడుస్తూ వెళ్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌ లోని బలియానుంచి జూలై 11వ తేదీన అశోక్‌ యాత్ర ప్రారంభమైంది. వైద్యనాథుని దర్శనంతోనే తన యాత్ర ముగిస్తానని చెబుతున్నాడు ఈ భక్తుడు.. అతడి భక్తికి, ధైర్యానికి దండం పెట్టాల్సిందే.. ఈ వార్త ఆ నోటా ఈ నోటా పాకింది. దాంతో వైరల్ అయ్యింది. అతను నిజంగానే సాహాసం చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరికొంతమంది దేవుడు కనిపించడం ఏమో గానీ చేతులు పోతాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news