2024లో వైసీపీ పార్టీ నుంచే పోటీ చేస్తా – వల్లభనేని వంశీ

-

విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానన్న ప్రచారంలో నిజం లేదని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. 2024 లో వైసీపీ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. ఇక హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని తాను వ్యతిరేకించలేదని, మరోసారి పేరు మార్పును పరిశీలించాలని కోరినట్లు చెప్పారు.

NTR, YSR చాలా పెద్ద లీడర్లని, NTR పేరు మార్చినంత మాత్రాన తక్కువ చేసినట్లు కాదన్నారు. గతంలో టిడిపి జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని వదిలేసిందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తోక పట్టుకుని ఈదాలి అనుకుంటున్నారు.. పవన్ తన క్యాడర్‌ను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మంత్రులపై దాడి చేయటం చాలా పొరపాటు…6 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న జనసేన ఇలా దాడి చేస్తే 50 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న వైసీపీ దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అన్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.

Read more RELATED
Recommended to you

Latest news