వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తా – వల్లభనేని వంశీ

-

వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు వల్లభనేని వంశీ. గన్నవరం పంచాయతీ పై స్పందించిన వల్లభనేని వంశీ… సీఎం కార్యాలయం నుంచి పిలుపు వస్తే వెళ్ళానన్నారు. వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో మళ్ళీ కలుద్దాం అన్నారని..నన్నేమీ అడగలేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుండి నేనే అభ్యర్థినని..వైసీపీ టికెట్ పైనే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

నా మీద ఎటువంటి విచారణకు అయినా డిమాండ్ చేసుకోవచ్చని.. అక్కడ ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదని తెలిపారు. నా మీద ఆరోపణల పై విచారణ కోసం సీబీఐ, ఐక్యరాజ్యసమితి కి కూడా లేఖలు రాయవచ్చు… తప్పేం లేదని.. నాకు అర్ధం లేని ఆరోపణల పై స్పందించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. మూడు ఎన్నికలు ఎదుర్కున్న వాడిని… ఏ ఊర్లో ఎవరితో పని చేయించుకోవాలో నాకు తెలుసు అన్నారు. ఎవరి దగ్గరా కోచింగ్ క్లాస్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదని… నియోజకవర్గంలో నా పని నేను చేసుకుంటున్నానని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news