జగన్‌ ఓ ఉన్మాది..వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలి – చంద్రబాబు

-

జగన్‌ ఓ ఉన్మాది..వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి…జగన్ ఉన్మాది లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. నిన్ననే సీబీఐ అధికారులు చెప్పారన్నారు. గతంలో పరిటాల రవిని చంపారు.. హత్యలు చేసి తప్పించుకోవడం…రాజకీయం చేయాలని చూస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

షర్మిల, ఎల్వీ సుబ్రమణ్యం, సవాంగ్ ఎక్కడున్నారు…రాయలసీమకు జగన్ ఏమీ చేశాడో చర్చించేందుకు సిద్దమని ఛాలెంజ్‌ విసిరారు. పులివెందుల కు ఏం చేశారో చెప్పండి… ఇక్కడి నుంచి ఐదు రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతోందని ఆరోపించారు.

మత్తులో చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయని.. ఊరు ఊరుకి గంజాయి గ్యాంగ్ తయారైందని విమర్శించారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నారు..టీడీపీ అధికారంలోకి వేస్తే భూ కబ్జాల పై విచారిస్తామని.. నలభై ఏళ్ళు గా కార్యకర్తలు జెండా మోశారు… మీ రుణం తీర్చుకుంటూ… మీకు అండగా ఉంటానన్నారు. పనిచేసేవారికి పార్టీ లో పదవులు రావాలని.. వలస పక్షులు, అయారాం గాయారం బ్యాచ్ కి అధికారం లోకి వస్తే అవకాశం ఉండదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news