BREAKING : TDPకి బిగ్‌ షాక్‌.. వల్లభనేని వంశీ పరువు నష్టం దావా దాఖలు

-

ఏపీ రాజకీయాల్లో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. తెలుగు దేశం పార్టీకి బిగ్‌ షాక్‌ ఇచ్చాడు టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ మోహన్. తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిపై ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ మోహన్ పరువు నష్టం దావా వేశాడు. సంకల్ప సిద్ధి గొలుసుకట్టు మోసంలో ఎమ్మెల్యే వంశీ పాత్ర ఉందంటూ పట్టాభి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు అనేక సార్లు ప్రెస్‌ మీట్లు, కోర్టుల చుట్టు తిరగారు తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి. అయితే, తాజాగా తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపణలపై రియాక్ట్‌ అయ్యారు టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ మోహన్. పట్టాభి తన ప్రతిష్టకు భంగం కల్గించే వ్యాఖ్యలు చేశారంటూ గన్నవరం కోర్టును ఆశ్రయించారు టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ మోహన్. తన అనుచరులతో కలిసి స్థానిక కోర్టులో ఇవాళ పరువు నష్టం దావా దాఖలు చేశారు ఎమ్మెల్యే వంశీమోహన్.

Read more RELATED
Recommended to you

Latest news