విజయవాడలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు స్వాగతం పలికిన నేతలు..

-

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్‌ రైలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెడుతోంది. దేశంలోనే అత్యంత వేగంతో ప్రయాణించే రైలుగా పేరుగాంచిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఇకపై తెలుగు రాష్ట్రాల మధ్య కూడా నడవనుంది. ఇవాళ సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కాగా ఈ రైలు వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడ చేరుకుంది. ఈ రైలు రాకతో విజయవాడ స్టేషన్ లో కోలాహలం నెలకొంది.

ఈ అత్యాధునిక ట్రైన్ ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ ఫోన్లలో వందేభారత్ రైలు రాకను చిత్రీకరించారు. ఈ రైలు సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకోనుంది. తెలంగాణలో వరంగల్ ఖమ్మం… ఏపీలో విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news