ANANDAIAH : ఆనందయ్యకు ఎమ్మెల్సీ ఇవ్వాలి.. గవర్నర్‌కు వినతి

-

అమరావతి : ఆనందయ్యకు ఎమ్మెల్సీ ఇవ్వాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు విన్నవించింది వెన్నెల అనే ఫౌండేషన్. కరోనా రోగులకు ఆయుర్వేదం వైద్యంతో చికిత్స చేస్తోన్న ఆనందయ్యకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని.. ఏపీ గవర్నర్ ను కోరింది వెన్నెల ఫౌండేషన్. అయితే దీనిపై స్పందించిన ఏపీ గవర్నర్.. తన వద్దకు వచ్చిన వినతిని.. ఏపీ ప్రభుత్వానికి పంపాలని తన కార్యాలయానికి ఆదేశాలు జారీ చేశారు.

దీంతో తమ వద్దకు వచ్చిన వినతిని పరిశీలించాలని.. ఏపీ సీఎస్ ఆదిత్య నాధ్ దాస్ కు లేఖ రాసింది గవర్నర్ కార్యాలయం. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఆనందయ్యకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలా ? లేదా ? అనేది త్వరలోనే తెలనుంది. కాగా ఆనందయ్య మందు గురించి ప్రత్యేకమైన పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఆనందయ్య నాటు మందుతో కరోనా తగ్గిపోతుందన్న వార్త దేశమంతటా పాకి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రప్రభుత్వాన్ని కృష్ణపట్నం వైపు చూసేలా చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news