2024లో కూడా ఏపీ సీఎం వైఎస్ జగనే – వేణు స్వామి

-

2024లో కూడా ఏపీ సీఎం వైఎస్ జగనేనని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి పేర్కొన్నారు. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఎక్కువగా సెలబ్రిటీల భవిష్యత్తు గురించి జ్యోతిష్యం చెబుతూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో చెబితే .. మరి కొంత మందికి భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో చెబుతూ ఉంటారు.

మరికొంతమంది ఎలాంటి దారిలో వెళ్తే సక్సెస్ అవుతారు అన్న విషయాలను కూడా ఆయన తెలియజేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఏపీ రాజకీయాలపై ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరోసారి జగన్‌ సీఎం అవుతారని వివరించారు. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు.. జగన్‌ కు ఎదురు అవుతాయని కానీ.. సీఎం మాత్రం ఆయనే అవుతారని చెప్పారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి.

Read more RELATED
Recommended to you

Exit mobile version