దేశాన్ని ముక్కలు చేయడమే బీజేపీ ఎజెండా: వీహెచ్

-

దేశాన్ని ముక్కలు చేయడమే బీజేపీ ప్రధాన ఎజెండా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఒకవేళ బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశం అంధకారంలోకి వెళ్లిపోతుందన్నారు. ఇప్పటికే దేశంలో కులాలు, మతాల మధ్య విధ్వేషాలు కలిగించే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇతర మతాలను కించపరుస్తూ.. రోజుకో వివాదానికి తెరలేపుతున్నారని అన్నారు. మతాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

వీ.హనుమంతరావు
వీ.హనుమంతరావు

దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ జోడో యాత్ర చేపడుతోందని వీహెచ్ తెలిపారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. జోడో యాత్రలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీ అధినేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారన్నారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా పాదయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పాదయాత్రకు హాజరై విజయవంతం చేయాలని వీహెచ్ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news