జోరుగా ‘లైగర్’ ప్రమోషన్స్..మీడియా‌పై విజయ్ దేవరకొండ ఫైర్..!

-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ..టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ ఫిల్మ్ లో సరికొత్త అవతార్ లో కనిపించనున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషించారు. వచ్చే నెల 25 న ఈ సినమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది మూవీ యూనిట్.

చిత్ర కథానాయకుడు, నాయిక ..విజయ్ దేవరకొండ, అనన్యా పాండే పలు ప్రాంతాలలో చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియాకు ఫొటోలు ఇస్తు్న్న క్రమంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫైర్ అయ్యారు. ‘లైగర్’, ‘లైగర్’..అంటూ మీడియా వారు ఫొటోలకు ఫోజులివ్వాలని అడగగా, విజయ్..చేయి చూపిస్తూ సీరియస్ గా కనిపించినట్లు తెలుస్తోంది.

మరో వైపున అనన్యా పాండే కూడా మీడియా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆమెతో కలిసి కూడా విజయ్ దేవరకొండ కొద్ది సేపు మీడియా వారికి ఫొటోలు ఇచ్చాడు. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కలిసి ప్రొడ్యూస్ చేసిన ఈ పిక్చర్ సక్సెస్ పైన మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. విజయ్ దేవరకొండ బాక్సర్ గా ఇరగదీశాడని మేకర్స్ చెప్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ లో విజయ్ దేవరకొండ బాడీ, యాక్టింగ్ చూసి జనాలు ఫిదా అయిపోయారు. డెఫినెట్ గా పిక్చర్ బ్లాక్ బాస్టర్ అవుతుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పూరీ జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ..తన నెక్స్ట్ ఫిల్మ్ ‘జన గణ మన(జేజీఎం)’ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news