విజయనగరంలో ఘోరం.. పాము కాటుతో విద్యార్థి మృతి , మరో ఇద్దరు సీరియస్

-

విజయనగరం జిల్లాలో ఘోరం జరిగింది. కురుపాంలో గురుకుల విద్యాలయంలో పాము కలకలం రేపింది. బీసీ రెసిడెన్షియల్ విద్యాలయంలో ముగ్గురు విద్యార్థులను పాము కాటేసింది. ఈ ఘటనతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు విద్యార్థులను పాము కాటేయడంతో ఇప్పటికే ఒక విద్యార్థి మరణించాడు. మరో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. 

మొత్తం 217 విద్యార్థులు ఉన్న ఈ గురుకులంలో కనీసం పడుకోవడానికి బెడ్ సౌకర్యం కూడా లేదు. రాత్రి పూట నేలమీద పడుకునే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలోనే పాము ముగ్గురు విద్యార్థులను కాటేసింది. ప్రస్తుతం ఓ విద్యార్థి మరణించగా… మరో ఇద్దరు విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. రాత్రి 12.30 పాము కాటేసిన వెంటనే వైద్యం కోసం విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. మొదట కురుపాంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ఆ తరువాత వైజాగ్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులంతా 8వ తరగతి చదువుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news