క్షుద్ర విద్యలు నేర్చిన నాగుపాము -చంద్రబాబుపై విజయసాయి సెటైర్‌

-

క్షుద్ర విద్యలు నేర్చిన నాగుపాము అంటూ చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సెటైర్‌ వేశారు. భూముల్ని కబళించే టీడీపీ కాలనాగుల్ని ప్రభుత్వం అడ్డుకోవడంతో బుసలు కొడుతూ విషం చిమ్ముతున్నాయి. పందులు అశుద్ధం తిన్నట్లు ప్రభుత్వ భూముల్ని కాజేయడమే చంద్రం, పప్పు, పీలా, అరగుండు పాత్రుడు, గీతం, బండ సత్యం, వెలగపూడి రాముల పని. ‘కుక్క నుంచి ముక్క లాగేస్తే అరిచినట్లే మొరుగుతున్నారని నిప్పులు చెరిగారు.

టక్కు టమార, గజకర్ణ గోకర్ణ వంటి క్షుద్ర విద్యలు నేర్చిన చంద్రం, పప్పు, అరగుండు పాత్రుడు, బండ సత్యం, గీతం భరత్, వెలగపూడి రాముల మాఫియా ముఠా విశాఖలో కొండలు, గుట్టలు, గెడ్డలు, వాగులు, వంకలు, గెడ్డలు, ఇనాం, వక్ఫ్, దేవాదాయ భూములను…కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా చెరబట్టేశారని చురకలు అంటించారు.

తెలుగు దొంగల పార్టీ కబ్జాకోరులు, భూబకాసురులైన గంజాయి పాత్రుడు, పీలా గోవిందు, బండారు, గీతం భరత్, వెలగపూడి రాము ఆక్రమించిన భూముల్ని కక్కించి, ప్రభుత్వానికి అప్పగిస్తుంటే అడ్డగోలు బాగోతాలు, వాదనలకు దిగారు. ఈ ద్రోహుల నుంచి 5 వేల కోట్ల విలువైన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని నిప్పులు చెరిగారు సాయిరెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news