వైసీపీ ప్లీనరీపై విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన !!

-

వైసీపీ ప్లీనరీపై విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్లీనరీ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని.. 8వ తేదీ ప్రతినిధులు వస్తారు .. అనేక తీర్మానాలు పెడుతున్నామని చెప్పారు. సామాజిక న్యాయం తదితర అంశాలపై మాట్లాడతారని.. నియోజకవర్గ, జిల్లా ప్లీనరీలో మంచి స్పందన కనిపించిందని వెల్లడించారు.
సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు.

ప్రజల స్పందన ఎలా ఉందో ప్లీనరీలో తెలుస్తుందని.. అందరికీ అన్నీ వసతులు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. తప్పకుండా ప్లీనరీ విజయవంతం అవుతుందని.. రెండు రోజులు పార్టీ అధ్యక్షుడు ప్లీనరీలో ఉంటారని చెప్పారు. ఆ రెండు రోజులు వానదేవుడు కరుణిస్తాడని ఆశిస్తున్నాం.ప్రభుత్వం వచ్చాకా మొదటి ప్లీనరీ ఇదన్నారు. మా పార్టీ విధానమే ప్రభుత్వ విధానమని.. ఇంకా మెరుగైన ఆలోచనలతో సీఎం ముందుకు వెళ్తారని పేర్కొన్నారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహిస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news