కేసీఆర్ కు తెలంగాణ రైతాంగమే తగిన శాస్తి చేస్తుంది – విజయశాంతి

-

 

కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన ధరణి రైతులకు బాధలను, దళారులకు డబ్బులను తెచ్చిపెడుతుంది. ధరణిలో ప్రొహిబిటెడ్​ లిస్ట్​లో ఉన్న భూములు కాసులు కురిపిస్తున్నాయన్నారు విజయశాంతి. ధర కోట్ల రూపాయల్లో ఉన్న ప్రాంతాల్లో ఎకరానికి ఇంత అని రేటు ఫిక్స్​చేసి నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తీసేస్తున్నారని పేర్కొన్నారు.

 

అదీ ప్రభుత్వ భూమి, అటవీ, వక్ఫ్‌‌, దేవాదాయ, అసైన్డ్​ ల్యాండ్ అయినా సరే పైసలిస్తే చాలు.. పనైపోతుంది. ఇదంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతుంది. ధరణి వచ్చినప్పటి నుంచి అన్ని జిల్లాల్లో ఈ వ్యవహారం గుట్టుగా కొనసాగుతూ వస్తోంది. గత వారం నుంచి ప్రొహిబిటెడ్​ లిస్ట్​లో ఉన్న భూములపై హైదరాబాద్​ సీసీఎల్ఏ ఆఫీసులో స్పెషల్​ మీటింగులు పెడుతూ ఆ లిస్ట్​లో నుంచి కొన్నింటిని తీసేస్తున్నారన్నారు.

 

 

ఇదే అదునుగా అర్హతలేని వాటిని కూడా ఈ జాబితాలో నుంచి తొలగించారు. ఈ క్రమంలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోంది. ప్రొహిబిటెడ్​ లిస్టులో ఉన్న సర్వే ననంబర్ తొలగించుకునేందుకు ఎకరాకు రూ.లక్ష నుంచి రూ. కోటి దాకా కూడా పెడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎకరం ధర రూ.5 కోట్లు ఉండగా.. ఆ సర్వే నంబర్​ ప్రొహిబిటెడ్​ జాబితాలో ఉంటే దానిని తీయించుకునేందుకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి దాకా ముడుపులు తీసుకుంటున్నారు. ఇలా అన్నదాతలను ఆగం చేస్తున్న కేసీఆర్ సర్కార్ కు తెలంగాణ రైతాంగమే తగిన శాస్తి చేస్తుందని పేర్కొన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news