దేశంలోనే అత్యంత ధనవంతుడు సీఎం కేసీఆరే – విజయశాంతి

-

దేశంలోనే అత్యంత ధనవంతుడు సీఎం కేసీఆరే అని సంచలన వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. కేసీఆర్ గారూ… తెలంగాణ రాజకీయ పరిస్థితులను సర్వనాశనం చేసి, ప్రజలు అనుకున్నట్లుగా ఓటు వెయ్యలేని ఒక దుర్మార్గ వ్యవస్థను మీ డబ్బుతో, అధికారంతో సృష్టించే ప్రయత్నం స్పష్టంగా చేస్తూన్నారని ఫైర్ అయ్యారు విజయశాంతి.

 

ఆ దుష్ప్రయత్నాలు జాతీయస్థాయిలో కూడా చెల్లుబాటు చేద్దామని, బీఆర్ఎస్ పేరుతో మీరు చేస్తున్న ప్రయోగాలు నిష్ప్రయోజనం అయి తీరుతాయి. దేశంలోనే అత్యంత డబ్బు కలిగిన రాజకీయ నేతగా, అహంభావంతో మీరు చేస్తున్న పనులన్నిటినీ తెలంగాణ సమాజం కూడా జాగ్రత్తగా గమనిస్తూనే ఉంది, సరైన సమయంలో తీర్పు చెప్పి తీరుతుందన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news