ప్రీతి ఘటన కేసీఆర్‌ ప్రభుత్వానికి పెద్ద మచ్చ – విజయశాంతి

-

ప్రీతి ఘటన కేసీఆర్‌ ప్రభుత్వానికి పెద్ద మచ్చ అన్నారు బీజేపీ నేత విజయశాంతి. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న వరంగల్ కేఎంసీ మెడికో డాక్టర్ ప్రీతి ఇక లేరని తెలిసి ఎంతో ఆవేదన కలుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపరంగా ఎన్నో వ్యవస్థలు, యంత్రాంగం ఉన్నప్పటికీ అవేవీ బాధ్యతాయుతంగా పనిచెయ్యకపోవడం… పాలకులు, అధికారుల ఉదాసీనత ఒక ఉన్నత విద్యావంతురాలిని వేధింపులకి బలి చేశాయని మండిపడ్డారు.

డాక్టర్ ప్రీతి తండ్రి రైల్వే పోలీస్ విభాగంలో ఏఎస్ఐ స్థాయిలో ఉన్న ఉద్యోగి… వేధింపులకి సంబంధించి తగిన ఆధారాలతో ఈయన ఇచ్చిన ఫిర్యాదునే పోలీసులు పట్టించుకోలేదంటే, రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం పనితీరు ఎంత నిర్లక్ష్యంగా ఉందో చెప్పాల్సిన పని లేదన్నారు. షీ టీమ్స్ పెట్టామని… ఇంకేమో చేశామని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ సర్కారుకి ఈ సంఘటన ఇదొక పెద్ద మచ్చ. ప్రీతి ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు విజయ శాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version