కేసీఆర్ గారి కామెడీ లిమిట్స్ దాటి పోతుంది..అన్నీ పాగల్ పనులే – విజయశాంతి

-

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కామెడీ లిమిట్స్ దాటి పోతుందని నిన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోళ్లపై విజయశాంతి సంచలన ట్వీట్‌ చేశారు. వారి పార్టీ MLA లు, వారి MLA ఫామ్ హౌస్, డబ్బు చూపని Bagలు, బీజేపీ కి నిర్ణయాత్మకమైన ఏమి సంబంధం తెల్వని పెద్దలు.. ఇవి, ఈ రోజు వార్తలు అన్ని తుగ్లక్ చర్యలే అంటూ మండిపడ్డారు.

ఈ విషయానికి, పోలీసు డిపార్ట్మెంట్ కి, లా అండ్ ఆర్డర్ కి ఏమి పరిధి ఉందో, ఏ శాఖకు చెందుతుందో అన్ని అధికారులు చేతిలో పెట్టుకొని ఏ శాఖ పై కూడా కనీస అవగాహన లేని సీఎం కేసీఆర్ గారికి తెలియాలని చురకలు అంటించారు.

ఇంతకీ మునుగోడు పై ఇంత భయం ఎందుకో, పాగల్ పనులు చేపడుతున్న కేసీఆర్ గారికి తెలియాలన్నారు. ఎయిర్ పోర్ట్ ట్యాగ్ ఉన్న బేగ్ లో పైసలేట్ల ఏల్తాయి? అవాస్తవానికి ఇది అతి ప్రదర్శన అన్నారు విజయశాంతి. ఇన్ని గత్తరబిత్తర మాటలు టీఆర్ఎస్ చెప్పిన, ప్రజలకు నిజాలు కూడా అర్థం అవుతునే ఉన్నాయని ఎద్దేవా చేశారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version