హైకోర్టు న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : వినోద్‌ కుమార్‌

-

ఈరోజు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌తో హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ సభ్యులు బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో కలిశారు. హైకోర్టు న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని బోయినపల్లి వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఈ సమావేశం లో నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియచేశారు.

Hyderabad: Bring out book on engineers' contribution says Boinpally Vinod  Kumar

హైకోర్టులోని మెడికల్‌ డిస్పెన్సరీని అప్‌గ్రేడ్‌ చేసి వైద్య సిబ్బందిని నియమించాలని, లైబ్రరీ నిర్వహణ కోసం నిధులు మంజూరు చేయాలని అసోసియేషన్‌ సభ్యులు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన శిక్షణ పొందే న్యాయవాదులకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా అవకాశాలు కలిపించాలని కోరారు. జూనియర్‌ న్యాయవాదులకు స్టైఫండ్‌ మంజూరు చేయాలని కోరారు.
ఈ సమావేశం లో వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ బార్‌ అసోసియేషన్‌ సూచించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. ఈ సమావేశంలో హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షులు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు చెంగల్వ కళ్యాణ్‌ రావు, కార్యదర్శి దేవేందర్‌, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news