‘విరూపాక్ష’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్!

-

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా ‘విరూపాక్ష’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  అయితే.. బీవీఎస్ ఎన్ ప్రసాద్ – సుకుమార్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి, కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సాయితేజ్ జోడీగా సంయుక్త మీనన్ నటించిన ఈ సినిమా, అడవి నేపథ్యంలో ఒక గిరిజన గూడెం చుట్టూ తిరుగుతుంది. ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ అంచనాలు పెంచుతూ వెళ్లాయి.

విరూపాక్ష' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్!

ఈ సినిమా నుండి ఇటీవ‌లే రిలీజ్ అయిన ప్ర‌మోష‌నల్ పోస్ట‌ర్స్, టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక మ‌రో నాలుగు రోజుల్లో (ఏప్రిల్ 21న) ఈ మూవీ వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది.. దీంతో మూవీ ప్ర‌మోష‌న్స్ ను మ‌రింత వేగవంతం చేశారు మేకర్స్. తాజాగా ఇవ్వాల ఈ మూవీ నుంచి కలల్లో అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఈ మెలోడి సాంగ్ కి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై నిర్మించిన ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news