విజయ సాయి రెడ్డి అతిపెద్ద అవినీతిపరుడు – వైసీపీ ఎంపీ

-

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వివాదస్పద వ్యాఖ్యలు చేశారట. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. బండ బూతులు తిట్టారని టాక్‌. విశాఖపట్నంలో అక్రమాలు మరియు భూదందాలను విజయసాయిరెడ్డి తన కుటుంబ సభ్యులు చేస్తున్నారని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారట.

విజయ సాయి రెడ్డి అతిపెద్ద అవినీతిపరుడని, అక్రమార్కుడు అని… విశాఖపట్నంలో ఆయన పెత్తనం ఏంటని నిలదీశారని సమచారం అందుతోంది. దీనిపై పీఎం కార్యాలయం ఏం చేస్తుందని ఎంపీ సత్యనారాయణ ఘాటుగా స్పందించారు.

తాను పత్రికను ప్రారంభిస్తానని, టీవీ న్యూస్ ఛానల్ పెడతానని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా దిగుతానని విజయ సాయి రెడ్డి అన్నారని, పార్టీ పెట్టడం ఒకటే ఆలస్యం అని ఎంబిబి సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. తాను ఆత్మగౌరవం ఉన్న వ్యక్తిని ఎవడికి తలవంచాల్సిన పని లేదని స్పష్టం చేశారు. తన బురద తానే పూసుకోవాలని, కానీ ఇతరులకు విజయసాయిరెడ్డి బురద అంటిస్తున్నారని నిప్పులు జరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news