కుప్పంలో చంద్రబాబు మీద పోటీగా బరిలోకి హీరో విశాల్ !

-

కుప్పం నియోజకవర్గం పై సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో.. టీడీపీ కంచుకోట ఆయన కుప్పం పై వైసిపి జెండాను ఎగరవేశారు. ఇక తాజాగా చంద్రబాబును ఊరించేందుకు సీఎం జగన్ పై ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే హీరో విశాల్ పేరును కుప్పం కోసం జగన్ సీరియస్ గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

విశాల్ స్వగ్రామం కుప్పం నియోజకవర్గం లోనే ఉంది. అతని తండ్రి జీకే రెడ్డి ప్రముఖ బిల్డర్. సినీ నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు. హీరో విశాల్ కు నాయకత్వ లక్షణాలు ఎక్కువే. నడిగర్ సంఘానికి ప్రెసిడెంట్ గా కూడా పని చేస్తున్నారు.

తెలుగు రాజకీయాలకు వస్తే విషయాలు మొదటి నుంచి వైసీపీ పార్టీకి, వైయస్సార్ కుటుంబానికి మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ తరఫున విశాల్ దించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ వార్తలు ఇంత నిజం ఉందో కూడా ఇంకా క్లారిటీ లేదు. దీనిపై త్వరలోనే వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news