బ్రేకింగ్ : యూపీలో మరో వాంటెడ్ క్రిమినల్ ఎన్‌కౌంటర్..!

-

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకీ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో వాంటెడ్ క్రిమినల్ టింకూ కపాలా హతమయ్యాడు. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన ఎన్‌కౌంటర్ లో కరడుకట్టిన నేరగాడు టింకూ కపాలా తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన టింకూను ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే మరణించాడని ఎస్పీ అర్వింద్ చతుర్వేది చెప్పారు. టింకూ కపాలా తలపై లక్ష రూపాయల రివార్డును యూపీ పోలీసులు ప్రకటించారు.

దోపిడి, హత్య కేసులు ఏడాది నుంచి ఈ నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ కాల్పుల్లో టింకూ అనుచరుడు తప్పించుకున్నాడు. లఖ్ నవూ, మహారాష్ట్రలో టింకూ కపాలాపై 27 కేసులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. కాగా, 3 వారాల క్రితం గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబేను యుపి పోలీసులు మ‌ట్టుబెట్టిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news