విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్ అమ్మే ప్రసక్తే లేదు : ఏపీ మంత్రి !

-

ఈ రోజు ఉదయం తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కొనడానికి సిద్ధమవుతోందని ఒక వార్త వచ్చింది. దీనితో ఏపీ ప్రభుత్వం అలెర్ట్ అయింది, అసలు అమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని… అలాంటప్పుడు తెలంగాణ కాదు ఎవ్వరైనా ఎలా కొనడానికి వీలుంటుంది అంటూ ఏపీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అన్నారు. వార్త వచ్చిన మాట వాస్తవమే.. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారికంగా మేము కొనడానికి బిడ్ వేస్తున్న అని తెలిస్తే.. అప్పుడు మేము కలిసి మాట్లాడి చెబుతాము.

అప్పటి వరకు ఎవరు ఏమైనా అనుకోండి అంటూ అమర్నాధ్ తెలిపాడు. ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడానికి చేస్తున్న రాజకీయం కుట్రలు అని గుడివాడ అమర్నాధ్ అభివర్ణించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్ అని దీనిని అమ్మడం అంటూ కుదరని పని అని తెగేసి చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news