వెస్ట్ ఇండీస్ కెప్టెన్: ఇండియా వన్ డే సిరీస్ తో ఫామ్ లోకి వస్తాం… !

-

ఇండియా ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా జరిగిన రెండు టెస్ట్ లలో ఒకటి ఇండియా గెలవగా, మరొక టెస్ట్ డ్రా గా ముగిసింది. ఇప్పుడు మూడు వన్ డే ల సిరీస్ నేటి నుండి మొదలు కానుంది. కనీసం వన్ డే సిరీస్ అయినా గెలుచుకుని పరువు దక్కించుకోవాలని వెస్ట్ ఇండీస్ కసిగా ఉంది. కాగా వెస్ట్ ఇండీస్ వన్ డే కెప్టెన్ షై హోప్ మాట్లాడుతూ… ఇండియాతో జరిగే వన్ డే సిరీస్ లో తిరిగి ఫామ్ లోకి వస్తాము అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. మా ఆటలో ఉన్న లోపాలను సరిచూసుకుని మళ్ళీ కొత్తగా ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి మొదటి అడుగు వేస్తున్నాము అంటూ హోప్ తెలిపాడు. ఎంతో టాలెంట్ ఉన్న హెట్ మెయిర్ తిరిగి జట్టులోకి రావడంతో మా జట్టుకు అదనపు బలం చేకూరింది అంటూ సంతోషంగా తెలిపాడు. హోప్ నమ్మకాన్ని చూస్తుంటే ఇండియాను కూడా ఓడించి సిరీస్ ను సొంతం చేసుకుంటారేమో అనిపిస్తోంది.

వెస్ట్ ఇండీస్ బలం వారికే తెలియదు. కానీ నిలకడలేమితో ఎన్నో గెలిచే మ్యాచ్ లను సైతం పోగొట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version