స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేసీఆర్ ఎప్పుడు మాట్లాడారు? – మంత్రి బొత్స

-

స్టీల్ ప్లాంట్ పై బిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను తప్పుబట్టారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. బిఆర్ఎస్ చెబితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్రం వెనక్కి తగ్గిందా..? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేసీఆర్ ఎప్పుడు మాట్లాడారని నిలదీశారు బొత్స సత్యనారాయణ. స్టీల్ ప్లాంట్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టత ఉందని, ఎవరెన్ని కామెంట్లు చేసినా పట్టించుకోమని స్పష్టం చేశారు.

ప్రస్తుతం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభించిందని.. పూర్తిస్థాయిలో కేంద్రం తన నిర్ణయం వెనక్కు తీసుకునే వరకు పోరాడతామని అన్నారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు మాటలు చిన్నపిల్లల మాటలని కొట్టిపారేశారు. పక్క రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు వాళ్ళకేం ఉందని నిలదీశారు. ఎవరి పరిధిలో వాళ్ళు మాట్లాడితే మంచిదని హెచ్చరించారు బొత్స.

Read more RELATED
Recommended to you

Latest news