మోడీ ఇచ్చిన సుపారీతో కెసిఆర్ యూపీఏను అధికారంలోకి రాకుండా ప్లాన్ చేస్తున్నాడు – రేవంత్ రెడ్డి

-

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా సెక్యులర్ నేత కుమారస్వామి తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కావడంపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ఇచ్చిన సుపారీతో కేసీఆర్ యూపీఏను అధికారంలోకి రాకుండా ప్లాన్ చేస్తున్నాడని అన్నారు. అయినా తీసేసిన నాయకులు.. ఎవరు ఎవరిని కలిస్తే ఏముంది.. సారా పాతదే, సీసా కొత్తదేమో అంటూ చురకలాంటించారు. కెసిఆర్ తన అవినీతిని బయటకు రానివ్వకుండా దృష్టి మళ్లిస్తున్నాడని విమర్శించారు.

దేశంలో మూడవసారి బిజెపి, రాష్ట్రంలో కెసిఆర్ రావాలని.. కెసిఆర్ ప్లాన్ అని పేర్కొన్నారు. అస్సాం ముఖ్యమంత్రి అక్కడ నిమర్జనం వదిలేసి తెలంగాణకు రావడం చిల్లర రాజకీయం అంటూ మండిపడ్డారు. బిజెపి నాయకులు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.. తెలంగాణలో శాంతిభద్రతలు దెబ్బ తినేలా చేస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news