తల్లితో సహజీవనం… కుమార్తెపై అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక

-

వావీ వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు కొంతమంది కామాంధులు. చిన్నాపెద్దా తారతమ్యాలు మరిచి ప్రవర్తిస్తున్నారు. కామంతో మహిళపై బరితెగిస్తున్నారు. చాలా సందర్భాల్లో తెలిసిన వారే.. బాలికలు, యువతులుపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తండ్రి స్థానంలో ఉన్న వారే కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా మచిలీపట్నంలో ఇలాంటి ఘటనే జరిగింది. మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి… ఆమె కూతురిపై కన్నేసి గత కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే క్రిష్ణా జిల్లా మచిలీపట్నం లో ఈ దారుణం జరిగింది. ఓ మహిళతో సహజీవనం చేస్తున్న సురేష్ అనే వ్యక్తి ఆమె కూతురుపై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. నిన్న బంధువులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా… మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. బాధిత బాలిక వయసు 17 సంవత్సరాలు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version