ఈజీ మనీకి అలువాటుపడ్డ మహిళ.. భర్తకు తెలియకుండా ఆ పని చేస్తూ..

-

ఈజీగా డబ్బు సంపాదించాలనుకున్న మహిళ చెడు దారికి అలువాటు పడింది. తన శరీరాన్ని అందుకు ఉపయోగించుకుంది. ఖర్చుల కోసం ఏకంగా తన అండాలను అమ్ముకుంది. విషయం తెలుసుకొని భర్త ప్రశ్నించడంతో.. చంపేస్తానంటూ అతణ్ని బెదిరించింది. విస్తుగొలిపే ఈ ఉదంతం గుజరాత్‌లోని అమ్రైవాడీ పోలీసు స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. నిందితురాలు అనితకు ఐదేళ్ల క్రితం పెళ్లయింది. అత్తమామలతో ఆమె తరచూ గొడవపడేది. అనిత ఒత్తిడితో ఆమె భర్త తన తల్లిదండ్రులకు దూరంగా.. అద్దె గదిలో వేరు కాపురం పెట్టాడు. అయితే భర్త ఆదాయం సరిపోవడం లేదంటూ ఆమె పలుమార్లు గొడవ చేసింది.

విసుగుచెందిన భర్త.. ఆమెను వదిలి 2019లో తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు. తర్వాత సయోధ్య కుదరడంతో కొన్నాళ్లుగా మళ్లీ కలిసి జీవించడం ప్రారంభించారు. అనిత డబ్బు కోసం అండాలు విక్రయించుకుంటున్న సంగతిని తాజాగా ఆమె భర్త గుర్తించాడు. ఇందుకోసం అహ్మదాబాద్‌లోని ఓ ఏజెంట్‌తోపాటు తన అత్త ఆమెకు సహకరిస్తున్నట్లు నిర్ధారించుకున్నాడు. ఈ వ్యవహారంపై భార్యను నిలదీశాడు. ఆమె పెద్ద గొడవ చేసింది. విషయం బయటకు చెప్తే చంపేస్తామంటూ బెదిరించింది. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అండాల విక్రయానికి వీలుగా అనిత ఆధార్‌ కార్డులో పుట్టినతేదీని మార్చుకుందని అందులో పేర్కొన్నాడు. భర్త అనుమతితోనే వాటిని అమ్ముకుంటున్నట్లు ఫోర్జరీ పత్రాలు సృష్టించిందని కూడా తెలిపాడు. 2019 జనవరి నుంచి 2022 జూన్‌ మధ్య పలుమార్లు ఆమె అండాలను విక్రయించుకుందని పేర్కొన్నాడు. ఈ వ్యవహారంలో పోలీసులు ఫోర్జరీ సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news