వైసీపీ గూండాలు అధికార మదంతో రెచ్చిపోతున్నారు – నారా లోకేష్

-

శ్రీకాళహస్తీశ్వర పాలకమండలి సభ్యుడు బుల్లెట్ జయశ్యామ్.. స్థానిక రాజ్ న్యూస్ విలేఖరి ఈశ్వర్ పై దాడికి పాల్పడ్డారు. శ్రీకాళహస్తికి సమీపంలోని రాజీవ్ నగర్ కాలనీ వద్ద తన ఇంటి స్థలాన్ని జయశ్యామ్ కబ్జాచేసి, పునాదులు వేశారని ఈశ్వర్ ఆరోపించారు. ఇదేం న్యాయమని ప్రశ్నించడంతో జయశ్యామ్ దుర్భాషలాడుతూ దాడికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు.

వైసీపీ గుండాలు అధికార మదంతో రెచ్చిపోతున్నారు అని మండిపడ్డారు. ప్రతిపక్షాలు, ప్రజలు, అధికారులపై దాడులు అయిపోగా.. ఇప్పుడు పాత్రికేయుల వంతు వచ్చిందని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ వద్ద జర్నలిస్టు ఈశ్వర్ పై వైసీపీ నేత శ్రీకాళహస్తీశ్వర ఆలయం బోర్డు మెంబర్ జయశ్యామ్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్ట్ పై దాడికి పాల్పడిన జయష్యామ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news