పేర్లు మార్చడం తప్ప వైసిపి చేసింది శూన్యం – సోము వీర్రాజు

-

వైసిపి ప్రభుత్వం పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఏపీకి అమరావతే రాజధాని అని గతంలో చెప్పిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చాక ఈ అంశంపై మాట తప్పి, మడమ తిప్పారని విమర్శించారు. ప్రాంతాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకే మూడు రాజధానుల పేరుతో వైసిపి డ్రామాలు ఆడుతుందని ఆరోపించారు.

కేంద్ర పథకాలకు జగన్ సొంత పథకాలుగా పేరు మార్చుకోవడం తప్ప.. రాష్ట్ర అభివృద్ధిలో మూడేళ్లలో వైసిపి ప్రభుత్వం చేసింది శూన్యమని మండిపడ్డారు. విశాఖపట్నం అభివృద్ధిని ఎవరూ వ్యతిరేకించడం లేదని అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమన్నారు సోమ వీర్రాజు.

Read more RELATED
Recommended to you

Latest news