గుంటూరు వేదిక నేటి నుంచి వైసీపీ ప్లీనరీ.. మొదటి రోజు వివరాలు ఇవే..

-

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో గుంటూరు వేదికగా వైసీపీ ప్లీనరీ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. వర్షం కురిసినా సభ ప్రాంగంణం ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వాటర్‌ ప్రూఫ్‌ టెంట్లను ఏర్పాటు చేశారు. అయితే మొదటి రోజు ప్రధానంగా ఐదు అంశాలపై చర్చ జరగనుంది. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సభ్యుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం. ఉదయం 10:10 గంటలకు పార్టీ జెండాను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ ఆవిష్కరించనున్నారు. ఉ.10:15 గంటల నుంచి 20 నిమిషాల వరకు ప్రార్ధనలు జరగనున్నాయి. ఉ.10:30 గంటలకు వైఎస్సార్‌ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10:55 గంటలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటనను పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేస్తారు.

YSRCP Plenary Meet LIVE - TV9 - YouTube

ఉ.11 గంటలకు పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రారంభోపన్యాసం జరుగుతుంది. అనంతరం పార్టీ జమాఖర్చుల ఆడిట్ నివేదిక ప్రతిపాదన.. ఆ తర్వాత ఆమోదిస్తారు. అనంతరం పార్టీ నియమావళి సవరణల ప్రతిపాదన, ఆమోదం ఉంటుంది. ఉ.11:35 గంటల నుంచి 11.45 నిమిషాల వరకు పార్టీ కార్యక్రమాలను నివేదిస్తారు. అనంతరం పార్టీ తీర్మానాలు ప్రారంభం అవుతాయి. ఉ.11:45 గంటలకు మహిళా సాధికారత దిశ చట్టం మొదటి తీర్మానం ఉంటుంది. ఈ తీర్మానంపై మంత్రులు ఉషశ్రీ చరణ్, రోజా , ఎమ్మెల్సీ పోతుల సునీత, లక్ష్మీపార్వతి, జక్కంపూడి విజయలక్ష్మిల ప్రసంగం ఉంటుంది. రెండో అంశంగా మధ్యాహ్నం ఒంటిగంటకు విద్యపై తీర్మానం చేస్తారు. ఈ అంశంపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సుధాకర్ బాబు, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మాట్లాడతారు.

అనంతరం మధ్యాహ్నం 2:15 గంటల నుంచి పావు గంట పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌పై తీర్మానం ప్రవేశపెడతారు. ఈ తీర్మానంపై మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3:15 గంటలకు వైద్యంపై తీర్మానం ప్రవేశపెడతారు.. దీనిపై మంత్రులు విడదల రజిని, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని మాట్లాడతారు. సాయంత్రం 4:30 గంటలకు పరిపాలనా- పారదర్శకత అంశంపై చర్చ జరుగుతుంది. ఈ అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, పార్థసారథి ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలతో మొదటిరోజు ప్లీనరీ సమావేశం ముగుస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news