ఇవాళ రాప్తాడులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉండనుంది. పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు జగన్. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి బెంగళూరుకు వైఎస్ జగన్ వెళతారు. ఈ మేరకుఅన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఇవాళ రాప్తాడులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉన్న తరుణంలో పరిటాల సునీత హాట్ కామెంట్స్ చేశారు.
జగన్ అనంతపురం పర్యటన పై ఎమ్మెల్యే పరిటాల సునిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హెలికాప్టర్ దిగకుండా జగన్ వెనక్కి పంపే శక్తి ఉందంటూ వార్నింగ్ ఇచ్చారు పరిటాల సునిత. జగన్ మోహన్ రెడ్డిని రాకుండా ఆపే దమ్ము, ధైర్యం రెండు కూడా ఉన్నాయని ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఎక్కిన హెలికాప్టర్ ను దిగకుండా తిరిగి పంపే శక్తి కూడా ఉందని హెచ్చరించారు. మా కార్యకర్తలు, నాయకులు కూడా అదే కోరుకుంటున్నారని ఆమె చెప్పారు. కానీ మాకు చంద్రబాబు ఇలాంటి సంస్కృతి నేర్పలేదని వెల్లడించారు.