ప్రజల కోసం కొట్లాడే పార్టీ కరవైంది.. పాదయాత్రలో వైఎస్ షర్మిల

-

తెలంగాణలో ప్రజల కోసం కొట్లాడే రాజకీయ పార్టీ కరవైందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రతి ఒక్కరు వారి అస్తిత్వం కోసమే పోరాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం.. పేదల ప్రభుత్వం కాదని అన్నారు. మద్యం అమ్మకాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని.. ఇది దొరల రాజ్యమని.. దొంగల ప్రభుత్వమని దుయ్యబట్టారు.

టీఆర్ఎస్ నాయకులు డబ్బులు సంపాదించుకునేందుకు మాత్రమే ఈ ప్రభుత్వం ఉందని షర్మిల ఆక్షేపించారు. హనుమకొండ జిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బంగారు తెలంగాణ తీసుకొస్తానని చెప్పి పేదోళ్లు బతకలేని తెలంగాణను సాధించారని విమర్శించారు.  రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం ఇచ్చే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్​రెడ్డి పెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పాదయాత్ర చేస్తున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు.

“ఈరోజు తెలంగాణలో మాట మీద నిలబడే నాయకుడే కనిపించడం లేదు. అందుకే నేను పార్టీ పెట్టాల్సి వచ్చింది. ప్రజల కోసం నిలబడి కొట్టాడే పార్టీ లేదు. రాజశేఖర్​రెడ్డి పెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీని పెట్టాను. మీరందరూ నన్ను ఆశ్వీరిందించండి. మళ్లీ రాజశేఖర్​రెడ్డి పాలన మీ చేతుల్లో పెడతానని మాట ఇస్తున్నాను.” – వైఎస్ షర్మిల, వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు

Read more RELATED
Recommended to you

Latest news