టిఆర్ఎస్ పాలనలో బీడీ బిచ్చం, కల్లు ఉద్దెర అన్నట్లుంది: వైయస్ షర్మిల

-

ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన షర్మిల సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కెసిఆర్ ను మళ్ళీ గెలిపిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడు అని ఆరోపించారు. కెసిఆర్ మోసం చేయని వర్గమే లేదని ఆరోపించారు. దళిత సీఎం నుంచి దళిత బంధు వరకు అన్ని మోసాలే అని విమర్శించారు. లక్ష కోట్లు అప్పు చేసినా టిఆర్ఎస్ పాలనలో..బీడీ బిచ్చం, కల్లు ఉద్దేర అన్నట్లు పరిస్థితి ఉందన్నారు. వడ్లు కొనే ముఖాలే అయితే వరివేస్తే ఉరి అని ఎందుకు బెదిరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ కుటుంబం రాజ్యమేలితే.. నిరుద్యోగులు చచ్చిపోవాలా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రజా సమస్యలే లేవంటున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తనతో పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్ విసిరారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవడం లేదని తేలితే.. ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్తాను అని అన్నారు. ఒకవేళ ఉన్నట్లు తేలితే రాజీనామా చేసి దళితుడిని సిఎం చేస్తారా అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ పాలనలో బంగారు తెలంగాణ బతకలేని తెలంగాణగా మార్చారని షర్మిల మండిపడ్డారు. కెసిఆర్ అక్రమంగా కోట్లు సంపాదించారు అంటున్న బిజెపి.. ఆధారాలు ఉంటే ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news