టీఆర్ఎస్ నేతలు రేప్ లు చేస్తుంటే..కేసీఆర్ గాడిదలు కాస్తున్నారా? : వైఎస్‌ షర్మిల

-

టీఆర్ఎస్ నేతలు రేప్ లు చేస్తుంటే..కేసీఆర్ గాడిదలు కాస్తున్నారా? అని వైఎస్‌ షర్మిల ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపిస్తే సొంత వ్యాపారాల కోసం TRSకు పశువుల్లా అమ్ముడుపోయారని ఆగ్రహించారు. MLAలు, మంత్రుల కొడుకులు, బంధువులు అత్యాచారాలు చేస్తున్నా.. కనీసం చర్యలు తీసుకోకుండా కేసీఆర్ గాడిదలు కాస్తున్నారా ? అని మండిపడ్డారు. అత్యాచార ఘటనలు వినిపించడం లేదా? కనిపించడం లేదా ? అని నిప్పులు చెరిగారు.

జల సమస్యల పై పోరాటం కోసమే YSR తెలంగాణ పార్టీ పుట్టిందని… కేసీఆర్ దిక్కుమాలిన పాలన లో మంచి నీళ్లకు కూడా దిక్కులేదని అన్నారు. బడులు,గుడులు ఎన్ని ఉన్నాయో … బార్లు, వైన్స్ కూడా అన్నే ఉన్నాయని… ఆడవాళ్ళ మాన – ప్రాణాలకు ఫణంగా పెట్టి మద్యం అనే వ్యాపారం చేస్తున్నారని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. మద్యం రాబడి తో రాష్ట్రాన్ని నడుపుతున్నారని.. బాలికలకు కూడా కేసీఆర్ పాలన లో రక్షణ లేదన్నారు. బాలికల ప్రాణాలను కాపాడలేని,రక్షణ ఇవ్వలేని కేసీఆర్ ఉరి వేసుకొని సచ్చిపోవాలి.. టీఆరెఎస్ అంటే హత్యాచారాల పార్టీ అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news