బంగారు బోనం సమర్పించిన వైయస్ షర్మిల

-

చారిత్రాత్మక హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మాతా మహంకాళి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున పూజల అనంతరం బోనాల సమర్పణతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆషాడ మాసం చివరి ఆదివారం లాల్ దర్వాజాతో పాటు హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి, చార్మినార్ భాగ్యలక్ష్మి, గౌలిపుర కోట మైసమ్మ, అలియాబాద్ దర్బార్ మైసమ్మ, దూద్బౌలి పయనీర్ ముత్యాలమ్మ, మీర్ ఆలం మండి మహంకాళేశ్వర మందిరంలో వేలాది మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు.

ఈ సందర్భంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బంగారు బోనం సమర్పించారు. కానీ బోనాన్ని తీసుకువచ్చిన షర్మిల ఆలయంలోపలకు వెళ్లి అమ్మవారిని దర్శించుకోలేదు. కేవలం ఆలయం వరకే వచ్చి తనతో పాటు వచ్చిన వారితో బోనాన్ని లోపలికి పంపించారు. ప్రతి ఏడాది బోనాలు ఉత్సవంలో పాల్గొంటానని, అక్కడకు వచ్చిన భక్తులను ఉద్దేశించి మాట్లాడి వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news