రేపే పార్టీ ప్రకటన.. విజయమ్మతో కలిసి ఇడుపులపాయకు షర్మిల

-

వైయస్ షర్మిల రేపు కొత్త పార్టీ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో… వైఎస్‌. షర్మిల.. తల్లి విజయమ్మ తో కలిసి కాసేపటి క్రితం కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయకు షర్మిల వెళ్లారు.

రేపు ఉదయం 8 గంటలకు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద జయంతి సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత కొత్త పార్టీ జెండాను తండ్రి సమాధి వద్ద ఉంచి అశీర్వాదం తీసుకోనున్నారు షర్మిల. అనంతరం ప్రత్యేక విమానంలో ఇడుపులపాయ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు వైయస్ షర్మిల. ఆ తర్వాత 3 గంటలకు పంజాగుట్ట చౌరస్తాలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్న వైఎస్ షర్మిల… 4 గంటలకు JRC కన్వెన్షన్ కు చేరుకోనున్నారు. అనంతరం 5 గంటలకు పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు.  ఇక తెలంగాణ లో షర్మిల పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version