BREAKING : వైసీపీ పెద్దలు మోసం చేశారు.. విషం తాగిన మహిళా నేత..!

-

విజయవాడలో వైఎస్సార్‌సీపీ మాల మహానాడు అధ్యక్షురాలు జోని కుమారి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తన సమస్యలు పరిష్కరించాలని ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్‌ మధ్యలోనే ఆమె విషం తాగేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ పెద్దలు తనని మోసం చేసారని, తనకు జరిగిన అన్యాయాన్ని విజయసాయిరెడ్డికి చెప్పుకున్నా న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు జరిగిన అన్యాయాన్ని ఈ కరోనా వల్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి చెప్పుకునే అవకాశం లేదని.. ఈ విషయంపై పార్టీ అధినాయకులను కలిసినా ఇప్పటి వరకు అసలు స్పందించలేదన్నారు. వైస్సార్సీపీ పార్టీని సొంత కుటుంబంలా భావిస్తే పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న పెద్దలు తనని మోసం చేసారని ఆవేదన వ్యక్తంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news