కార్తీకదీపం ఎపిసోడ్ 1241: మళ్లీ డాక్టర్ గా మారనున్న కార్తీక్..నర్సమ్మను ఇంట్లోంచి వెళ్లగొట్టి మోనితకు వార్నింగ్ ఇచ్చిన వారణాసి

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ ఇంట్లో కూర్చుని రుద్రాణి మాటలను తలుకుంటూ..తీక్షణంగా ఆలోచిస్తుంది. బాబుని చూస్తూ.. ఇంత సేపు పడుకున్నాడేంటనుకుంటాడు. జ్వరం రావడంతో చన్నీళ్లతో వళ్లంతా తుడుస్తాడు. అయినా..టెంపరేచర్ తగ్గదు. ఇలా చేస్తే తగ్గేలా కనిపించటంలేదే…జ్వరం మందు వేయాల్సిందే, ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందే.నీకేంకానివ్వను..నేను కూడా డాక్టర్ నే అనేసి..గతం తలుచుకుని..నేను డాక్టర్ ని కాదురా అని బయటకు వచ్చి..దీప ఎక్కడికి వెళ్లింది..ఊరంతా దాదాపుగా తిరిగాను ఎక్కడా కనిపించలేదు అనుకున..రుద్రాణి మాటలను తలుచుకుని…ఏమైనా చేసిందా అని ఆలోచించి వెతికేందుకు వెళుతుండగా దీప ఇంటికి వస్తుంది. ఏంటీ దీపా, ఎక్కడికి వెళ్లావ్, నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా , ఏమయ్యావో, ఎవరేం చేశారో అని అంటాడు. కొంచెం ఆలస్యం అంతే అంటుంది దీప. ఇంకెప్పుడు ఆలస్యంగా రాకు అని కార్తీక్ అంటే..పిండి వంటలు అమ్మేందుకు కొంచెం ఎక్కువ తిరిగాను, మీరెందుకు అలా భయపడుతున్నారంటుంది. ఆ రుద్రాణి అని ఏదో చెప్పబోయి ఆగిపోతాడు కార్తీక్. ఆ రుద్రాణి ఏమైనా అందా అంటే..జరిగింది చెప్తాడు కార్తీక్. తనేదో అందని భయపడుతున్నారా, రుద్రాణి నన్నేం చేస్తుందంటుంది. నీ కోసం నేను ఊరంతా వెతికాను అంటాడు.. ఇంతలో అక్కడకు పిల్లలు వచ్చి రుద్రాణి లంచ్ తీసుకొచ్చిందని అందుకే తినకుండా తొందరగా వచ్చేశాం అంటారు. ఆమ్మా ఆవిడ మాకెందుకు లంచ్ బాక్స్ తెస్తోందని పిల్లలు ప్రశ్నలమీద ప్రశ్నలు వేస్తారు. తెలిసినావిడక కదా.. అందుకే తీసుకొచ్చిందేమో అని సర్దిచెప్పి పడుకోమంటుంది..

తెల్లారి దీప-కార్తీక్ ని వెతుకుతూ తాడికొండ గ్రామానికి వెళ్లిన బిచ్చగాడు కార్తీక్ ఫొటో చూసి ఎక్కడున్నారు సార్ అనుకుంటాడు. ఈ ఊర్లో వెతకడం అయిపోయింది ఇప్పుడు మరో ఊరు వెళ్లాలని అనుకుంటాడు. మరోవైపు బాబుకి జ్వరం వచ్చిందంటూ ఒళ్లు తుడుస్తాడు కార్తీక్. దీప ఏం చేస్తున్నారు అంటే..చెప్తాడు. ఇవన్నీ మీకెలా తెలుసు అన్న దీపతో..నేను డాక్టర్ ని అనబోయి ఆగిపోతాడు. ఎవరో ఏదో అన్నారని పదిమందికీ ఉపయోగపడే వృత్తిని కాదనుకుంటే ఎలా అంటుంది. స్వామీజీ-పాము కథ చెబుతుంది..స్వామి చెప్పాడని కాటేయడం మానేసిన పాముని అంతా కొట్టేవారు.. కొన్నాళ్లకి పాము స్వామిజీ దగ్గరకు వెళ్లి నేను కాటేయడం మానేసినా అంతా కొడుతున్నారని అంటే.. కాటేయొద్దు అన్నా కానీ బుసకొట్టొద్దని చెప్పలేదు కదా అనే కథ చెబుతుంది. మీరు ఒక కథలాగే.. ఎన్నో గొప్ప ఆపరేషన్లు చేసిన మీ చేతిలో ఓ ప్రాణం పోయింది..దానికి కారణాలేవైనా జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని మర్చిపోండి. శ్రీవల్లీ- కోటేష్ లు మనకి ఆశ్రయం ఇచ్చారు. మన కళ్లముందే వాళ్లు చనిపోయినా ఏం చేయలేకపోయాం. తెలియని వాటికి బాధ్యత వహించకపోయినా, కళ్లముందు కనపిస్తున్నవాటికైనా బాధ్యత వహించాలంటుంది దీప. వాడికి జ్వరం వచ్చింది, తడిబట్టతో తుడుస్తూ కుర్చున్నారు. డాక్టర్ ని కాదని మీకు మీరే చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు సమాధాన పర్చుకుంటున్నారు..ఎవరు అవునన్నా కాదన్నా మీరు డాక్టరే. తెలియన వంద తప్పులు చేయొచ్చు కానీ తెలిసి ఒకతప్పు చేయడం పాపం అని గట్టిగా క్లాస్ ఇచ్చి బాబుని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తా అంటుంది. ఇంతలో కార్తీక్ బాబుకి అవసరమైన మందులను డాక్టరుగా రాసా తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు.

సౌందర్య- ఆదిత్య

మోనిత ఫోటో తీసుకెళ్లింది ఆదిత్యకు చెప్తుంది. ఆ ఫోటోతో ఏం చేస్తుందో ఏంటో అంటుంది. అసలే బస్తీలో ఇల్లు కొనుక్కుని ఆసుపత్రి పెట్టింది కదా అంటే..అమ్మా ఆ మోనిత గురించి ఎక్కువ భయపడుతున్నావు..అన్నయ్య ఆచూకీ కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నా అంటాడు ఆదిత్య. అన్నయ్య వాళ్లు కావాలని మనకు దొరక్కుండా జాగ్రత్తపడుతున్నారు కాబట్టి దొరకలేదు కానీ లేదంటే ఈపాటికి ఎప్పుడో పట్టుకునే వాళ్లం అంటాడు. సౌందర్య మోనిత అంటే.. మోనిత వల్ల కొత్తగా జరగాల్సిన నష్టం ఏమీలేదు..మోనితని మరిచిపో అని వెళ్తాడు.

ప్రజా వైద్యశాలలో మోనిత నర్సమ్మా అంటూ అరుస్తుంది. వారణాసిని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. నర్సమ్మని బయటకు పంపించాం అన్న వారణాసి..ఎవ్వరు వచ్చినా పంపించేస్తామని చెప్తాడు. ఏయ్ నువ్వు ఎక్కువ చేస్తున్నావ్ అంటుంది మోనిత..మీ ఆటలు ఇక్కడ సాగవు, ముందు ముందు చాలా జరుగుతాయ్.. మీకు మా బస్తీవాళ్లగురించి పూర్తిగా తెలుసుకుంటారు అని బెదిరించి వెళ్తాడు వారణాసి.

దీప ఇంట్లో

దీప పిల్లలకు అన్నం తినిపిస్తుంది. అమ్మా తమ్ముడికి కూడా పెడదామా అని అడుగుతారు. అప్పుడే పెట్టకూడదని చెబుతుంది. బయట వాళ్లు.. మనకే తినడానికి ఇబ్బంది అంటే ఓ బాబుని పెంచుకుంటున్నారని అంటున్నారని చెబుతుంది శౌర్య. మన చుట్టూ ఉన్న వాళ్లవాళ్లంతా మన ఎదురుగా మాట్లాడరు..వెనకే మాట్లాడతారు. అడవిలో సింహంలా బతకాలి..జంతువులు ఏం మాట్లాడుకున్నా పట్టించుకోకూడదంటుంది దీప. ఈ వయసులోనే వీడు తల్లిదండ్రులును పోగొట్టుకుని మనకు దగ్గరయ్యాడు..మన దగ్గరే ఉంటాడు ఎవరేమన్నా పట్టించుకోవద్దు..వీడు మనవాడు..మన కుటుంబంలో సభ్యుడు అంటుంది దీప. హిమకు రుద్రాణి అన్నంతినమని బలవంతం చేసింది గుర్తుచేసుకుని..ఆ‌విడ ఏంటమ్మా మాకు లంచ్ బాక్స్ పంపించారు..మీతో గొడవపడి మాతో ఏమో బాగా మాట్లాడుతుందేంటమ్మా అని అడుగుతారు. ఎపిసోడ్ ముగిసింది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news