తమ్ముడూ… అమ్మాయి తర్వాత, ముందు క్రికెట్ ఆడు – పంత్‌పై ఫ్యాన్స్ ఫైర్

-

టీం ఇండియా యువ క్రికెటర్ రిశబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టినప్పుడు అతనిపై చాలా అంచనాలు ఉన్నాయి. ధోని వారసుడిగా పంత్ నిలబడతాడు అంటూ అతని ఆట తీరు తెలిసిన వాళ్ళు అతన్ని ఆకాశానికి ఎత్తేసారు.అనుకున్నట్టు గానే టెస్ట్ జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. రెండు సెంచరీలు, రెండు 90లు కొట్టి అంతర్జాతీయ క్రికెట్ లో తన మార్క్ చూపించాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ లో మాత్రం పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేదు అనేది వాస్తవం.

ఎన్ని అవకాశాలు ఇస్తూ వచ్చినా సరే పంత్ మాత్రం తన స్థాయికి తగిన విధంగా ఆడలేదు. అయితే ఈ యువ క్రికెటర్ అమ్మాయిల విషయంలో మాత్రం కాస్త దూకుడుగానే ఉంటాడు. ఇషా నేగి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న ఈ ఢిల్లీ ఆటగాడు తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా ఆమెతో కలిసి దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. గర్ల్ ఫ్రెండ్ ఇషా నేగితో కలిసి మంచుతో కప్పబడిన పర్వతంపై ఒక చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.

దీనిపై క్రికెట్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. తమ్ముడు నువ్వు కెరీర్ మొదట్లో ఉన్నావు నీకు ఎందుకు ఇవన్ని అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు అయితే హడావుడి గా రెండు షాట్ లు కొట్టి అవుట్ అవుతావ్ అమ్మాయి తో చాట్ చేయడానికా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అయితే తమ్ముడు నువ్వు క్రికెట్ ఆడు తర్వాత అమ్మాయి, ధోని స్థాయిలో నిన్ను ఊహించుకున్నాం. ధోని స్థిరపడిన తర్వాత ఇవన్ని చేసాడు. నీకు అన్నింటిలోను తొందరే అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news