ఉద్యోగం చేస్తూ యూట్యూబ్ ఛానెల్ ను పెట్టారా?..మీ పని గోవిందే..

-

ఉద్యోగం చేసే వారికి కూడా పదిమంది తనను చూసి మెచ్చుకోవాలని అనుకోవడం తప్పులేదు.. అలాంటి పిచ్చితో కొందరు సొంతంగా యూట్యూబ్ ఛానెల్స్ ను పెట్టుకుంటారు. డిఫరెంట్ కంటెంట్ తో ఆకట్టుకోవాలని ట్రై చేస్తారు.. ఇకమీదట అలాంటి పప్పులు ఉడకవు.. ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు యూట్యూబ్ లో వీడియోలు చెయ్యరాదని కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది..సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారనే కారణంతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది..

 

యూట్యూబ్ ఛానెల్‌ల ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం రాకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి 3న రాష్ట్ర హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వు ప్రకారం, యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించడం కేరళ ప్రభుత్వ సేవకుల ప్రవర్తనా నియమాలు, 1960ని ఉల్లంఘించడమే అని పేర్కొంది. యూట్యూబ్ ఛానెల్స్ ప్రారంభించడానికి ప్రస్తుత నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కళాత్మకమైన పనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి అనుమతి కోరుతూ ఫైర్ సర్వీస్ దాఖలు చేసిన దరఖాస్తుకు ప్రతిస్పందనగా ఈ ఆర్డర్ ఇచ్చింది..

యూట్యూబ్ చానల్ నిర్వహణకు అనుమతి కోరుతూ అగ్నిమాపక సిబ్బంది చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు యూట్యూబ్ చానళ్లు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని ఆ జీవోలో పేర్కొంది. ఫైర్ ప్రొటెక్షన్ సర్వీస్‌కు అనుమతి నిరాకరిస్తూ ఆర్డర్ జారీ చేసింది..ఈ విధంగా యూట్యూబ్ నుండి డబ్బు సంపాదించడం ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించడమే. అందువల్ల ఉద్యోగులు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది..ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ప్రజలు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఒక వ్యక్తి యొక్క యూట్యూబ్ ఛానెల్‌ని 12 నెలల్లో కనీసం 1,000 మంది సబ్‌స్క్రైబ్ చేసి, 4,000 గంటల పాటు వీక్షిస్తే, ఛానెల్‌ని నడుపుతున్న వ్యక్తి డబ్బులను సంపాదించవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news