ఆధార్ హ్యాకథాన్ తో మూడు లక్షలు పొందండి…!

-

ఆధార్ హ్యాకథాన్ తో మూడు లక్షల రూపాయలని గెలుచుకునే అవకాశాన్ని అందించింది యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా UIDAI. ఈ హ్యాకథాన్ లో గెలిస్తే తప్పక మూడు లక్షలు గెలుచుకునే అవకాశం వుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాకథాన్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని విజేతలుగా నిలిచి డబ్బులు పొందొచ్చు. ఇది ఇలా ఉంటే ఈ ఆధార్ హ్యాకథాన్ అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రమే ఉంటుంది. పాల్గోవాలని అనుకునే వారు రిజిస్రేషన్ చేయించుకోవాలి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ మొదలు అయ్యింది.

అక్టోబర్ 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే దీనిలో పాల్గొనాలంటే మీరు ఇంజినీరింగ్ కాలేజీల్లోని విద్యార్థులు అయ్యి ఉండాలి. సమస్యలకు సాంకేతికత ద్వారా పరిష్కారం లక్ష్యంగా ఆధార్ ఈ హ్యాకథాన్‌ను నిర్వహిస్తోంది. ఎన్‌రోల్‌మెంట్ అండ్ అప్‌డేట్, ఐడెంటిటీ అండ్ అథంటికేషన్ వంటి థీమ్స్ ఆధారంగా దీనిని తీసుకొస్తారు.

ఐదు మంది ఒక టీమ్‌గా ఏర్పడొచ్చు. అలానే ప్రతి ఒక్కరికీ ఆధార్ తప్పనిసరి గమనించండి. ఆధార్ హ్యాకథాన్ విజేతకు రూ.3 లక్షలు పొందొచ్చు. అలానే రన్నర్‌గా నిలిచిన వారికి రూ.2 లక్షలు వస్తాయి. ఆధార్ 2.0 గ్లోబల్ కాన్ఫరెన్స్‌కు ఈ టీమ్స్‌కు ఇన్విటేషన్ మరియు సర్టిఫికెట్ కూడా ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news