సీనియర్ సిటిజన్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే వడ్డీ రేట్లు పెంపు..?

-

సీనియర్ సిటిజన్స్‌కు గుడ్ న్యూస్ కు త్వరలోనే ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ను చెప్పబోతుందని ఒక వార్త వినిపిస్తుంది.. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లు పదవీ విరమణకు మంచి ఎంపికగా పరిగణించబడతాయి. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే పన్ను మినహాయింపు నుంచి వడ్డీ వరకు ప్రయోజనాలు ఉంటాయి.60 ఏళ్లు పైబడిన వాళ్లు పెట్టుబడి పెట్టవచ్చు.. ఇక సినియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లు పదవీ విరమణకు మంచి ఎంపికగా పరిగణించబడతాయి. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే పన్ను మినహాయింపు నుంచి వడ్డీ వరకు ప్రయోజనాలు ఉంటాయి..

ఈ పథకం కింద, త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ ఇవ్వబడుతుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే వారికి ప్రభుత్వం గొప్ప వార్తను అందించగలదు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లను ఈ నెలాఖరులోగా కేంద్ర ప్రభుత్వం మార్చవచ్చు.. మీరు ఖాతాను తెరవాలనుకుంటే,మీరు అధీకృత బ్యాంక్ మరియు పోస్టాఫీసులో ఈ ఖాతాను తెరవవచ్చు. SCSS కింద కేవలం రూ. 1000తో పొదుపు ఖాతాను తెరవవచ్చు. ఇప్పటివరకు SCSSలో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షలుగా ఉంది, ఇది బడ్జెట్ 2023లో రూ.30 లక్షలకు పెంచబడింది.. ఇది గమనించాలి..

ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను మినహాయింపు కూడా ఉంటుంది… 1.50 లక్షల వరకు పెట్టుబడి పన్ను మినహాయింపు కింద వస్తుంది మరియు దాని మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు. తరువాత SCSS పెట్టుబడిని మరో మూడు సంవత్సరాలు పొడిగించవచ్చు. ఈ పథకంలో, రూ. 10,000 పెట్టుబడి లేదా డిపాజిట్‌పై ప్రతి త్రైమాసికానికి రూ. 200 రాబడి అందుతోంది. అంటే, ఈ ఐదేళ్ల పథకంలో, మీరు మొత్తం రూ. 4000 రాబడిని పొందుతారు. ఇప్పుడు మీరు బడ్జెట్ అనంతర నియమం ప్రకారం ఇందులో రూ. 20,000 పెట్టుబడి పెడితే, మీరు ప్రతి త్రైమాసికంలో రూ. 400 రాబడిని పొందుతారు. అదే మీరు ఐదు సంవత్సరాలు పెడితే రూ. 8000 మీరు పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news