IRCTC టూర్: రూ.500 ప్యాకేజీతో హైదరాబాద్ చూడచ్చు..!

-

మీరు హైదరాబాద్ లో వుండే పర్యాటక ప్రదేశాలని చూడాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTC టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ఈ ప్యాకేజీతో చక్కగా హైదరాబాద్ చూసేయచ్చు. ఇక ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

ఐఆర్‌సీటీసీ టూరిజం ఈ ప్యాకేజీని హెరిటేజ్ హైదరాబాద్ వన్ డే టూర్ ప్యాకేజీ పేరుతో ఇస్తోంది. ఈ ప్యాకేజీ ధర ఒకరికి రూ.505 మాత్రమే. ధర కూడా తక్కువే కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఈ ప్రదేశాలని చూసేయచ్చు. ఐఆర్‌సీటీసీ టూరిజం హెరిటేజ్ హైదరాబాద్ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకుంటే ఒక రోజులో హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలను చూడొచ్చు.

సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల దగ్గర ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం అవుతుంది. సరిగ్గా ఉదయం 8 గంటలకు టూర్ మొదలవుతుంది. ఈ టూర్ లో ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, సాలార్‌జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీద్, చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్ చూడొచ్చు.

అయితే ఇది ఒక రోజు ప్యాకేజీ మాత్రమే. సోమవారం, శుక్రవారం తప్ప మిగతా ఐదు రోజులు ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. టూర్ అయ్యాక రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, టోల్ ఛార్జీలు, పార్కింగ్ ఛార్జీలు ప్యాకేజీలో కవర్ అయ్యిపోతాయి. అయితే ప్రయాణికులు వసతి, భోజన సదుపాయం, పర్యాటక ప్రాంతాల దగ్గర ఎంట్రెన్స్ ఫీజులు వంటివి తామే పెట్టుకోవాలి. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో చూడచ్చు.

13 నుంచి 22 మంది ప్యాకేజీ బుక్ చేసుకుంటే ఒకరికి రూ.505 చెల్లించాలి. 7 నుంచి 12 మంది ప్యాకేజీ బుక్ చేసుకుంటే ఒకరికి రూ.1,145 చెల్లించాలి. అదే ఈ ప్యాకేజీ 4 నుంచి 6 మంది బుక్ చేసుకుంటే ఒకరికి రూ.1,170 చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Latest news