స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు…డైరెక్ట్ జాబ్ ఏ..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. దేశీయ దిగాజా బ్యాంక్
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. పలు పోస్టులని భర్తీ చెయ్యాలని చూస్తోంది. ఇందుమేరకు నోటిఫికేషన్ ని కూడా విడుదల చేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

అర్హులైన వారు ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాల్సి వుంది. మార్చి 15, 2023వ తేదీ లోపు అప్లై చేసుకోవడానికి సమయం వుంది. ఇక అర్హత వివరాలని చూస్తే… మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్‌) పోస్టులకు ఎంబీఏ (మార్కెటింగ్), పీజీడీఎం/ పీజీపీఎం (మార్కెటింగ్) పూర్తి చేసి ఉండాలి. దానితో పాటుగా అనుభవం తప్పక ఉండాలి. ఫ్యాకల్టీ (ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్) పోస్టులకు అయితే ఏదైనా స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీ ఉండాలి. అలానే అనుభవం కూడా ఉండాలి.

ఇక వయస్సు విషయానికి వస్తే… డిసెంబర్ 31, 2022 నాటికి 28 నుంచి 55 సంవత్సరాల వయస్సు ఉండాలి. దరఖాస్తు ఫీజు గురించి చూస్తే.. అభ్యర్ధులు రూ.750 అప్లికేషన్‌ ఫీజు కింద పే చెయ్యాల్సి వుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. షార్ట్‌ లిస్టింగ్ కమ్ ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముంబయి, ఎస్‌బీఐఎల్‌, కోల్‌కతా లో పని చేయవల్సి ఉంటుంది. పూర్తి వివరాలని స్టేట్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ లో చూసి అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news